వైసీపీలోకి మళ్లీ వలసలు.... టీడీపీకి షాక్!!!

Update: 2018-12-16 04:10 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు పార్టీలో చేరనున్నారు. ఆయన జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని కలిసి తన మనసులో మాట తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీల్లో అన్నా రాంబాబు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అన్నా రాంబాబు టీడీపీలో ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన అశోక్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని అన్నా రాంబాబు తెలిపారు.

Similar News