వైఎస్ జయంతి నాడు…??

ీఈ నెల 8వ తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి [more]

Update: 2019-07-03 11:02 GMT

ీఈ నెల 8వ తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలోనూ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అన్నదానంతో పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా వైఎస్ జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వైఎస్ జయంతిని ఇడుపుల పాయలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఇడుపుల పాయలోనే పెంచిన పింఛన్లను జగన్ స్వయంగా పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటు పార్టీ అటు ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News