బ్రేకింగ్ : మైదుకూరులో టీడీపీకి షాక్… మున్సిపాలిటీ వైసీపీదే

మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ గా మాచనూరు చంద్ర ఎంపికయ్యారు. ఇద్దరు గైర్హాజరు కావడంతో వైసీపీ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే [more]

Update: 2021-03-18 06:17 GMT

మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ గా మాచనూరు చంద్ర ఎంపికయ్యారు. ఇద్దరు గైర్హాజరు కావడంతో వైసీపీ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా మైదుకూరును వైసీపీ గెలుచుకుంది. మరోవైపు టీడీపీ కౌన్సెలర్ షేక్ మహబూబి, జనసేన అభ్యర్థి బాబులు ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. దీంతో విజయం వైసీపీ వైపు నిలిచింది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ 13 స్థానాలను దక్కించుకుని అతి పెద్ద పార్టీగా ఉన్నా మున్సిపల్ ఛైర్మన్ ను దక్కించుకోలేకపోయింది.

Tags:    

Similar News