రంగులు మారిస్తే రాత రివర్స్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకాలకు పేర్లు మార్చింది. ఓకే. కొత్త పథకాలకు కొత్త పేర్లు పెడుతోంది ఓకే. అయితే కొంత మంది [more]

Update: 2019-11-11 06:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకాలకు పేర్లు మార్చింది. ఓకే. కొత్త పథకాలకు కొత్త పేర్లు పెడుతోంది ఓకే. అయితే కొంత మంది వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీ కలర్ పూసేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ప్రభుత్వ పాఠశాలలకు కూడా వైసీపీ రంగులు వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి జగన్ కు చెప్పి ఇలా చేస్తున్నామని అనుకోలేం కాని, ఆయనకు తెలియకుండా జరిగినా నష్టం ఆయనకు….పార్టీకే. ఇప్పటికైనా అత్యుత్సాహం ప్రదర్శించే వైసీపీ నేతలను జగన్ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News