వైసీపీలోకి మరో ఎంపీ, మాజీ మంత్రి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పలువురు సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో [more]

Update: 2019-03-16 07:32 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పలువురు సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ కూడా వైసీపీలో చేరనున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మరికొందరు సైతం జగన్ సమక్షంలో ఇవాళ సాయంత్రం వైసీపీలో చేరనున్నారు.

Tags:    

Similar News