ఏడాది జగన్ పాలనకు వంద మార్కులు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు సంబరాలుచేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేకు కట్ చేసి తమ అభిమానులతో [more]

Update: 2020-05-23 06:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు సంబరాలుచేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేకు కట్ చేసి తమ అభిమానులతో పండగ చేసుకుంటున్నారు. గత ఏడాది ఇదే రోజున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 151 సీట్లను ప్రజలు వైసీపీకి కట్టబెట్టారు. 50 శాతం ఓట్లను వైసీపీ ఈ ఎన్నికల్లో కైవసం చేసుకోగలిగింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఏడాది పాలనకు వంద మార్కులు వేయవచ్చన్నారు. నాలుగేళ్లలో మరిన్ని పథకాలు ప్రజల చెంత జగన్ చేరుస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల తెలిపారు. తొలి ఏడాది మొత్తం జగన సంక్షేమంపైనే దృష్టి పెట్టారన్నారు. అందుకే వందకు వంద మార్కులు వేయాలన్నారు.

Tags:    

Similar News