ఎన్నికల సంఘంలోనూ టీడీపీ కోవర్టులున్నారు

ఎన్నికల సంఘంలోనూ అధికార పార్టీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ నేత నాగిరెడ్డి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని [more]

Update: 2019-05-03 12:53 GMT

ఎన్నికల సంఘంలోనూ అధికార పార్టీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ నేత నాగిరెడ్డి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘంలో ఆబ్జెక్ట్ అనే ఏజెన్సీ ద్వారా సోషల్ మీడియా వర్కర్స్ గా పనిచేస్తున్న కొందరు వ్యక్తులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోనించారు. ఇంటెలిజెన్స్ ద్వారా టీడీపీ కోవర్టులను ఎన్నికల సంఘంలోకి చేర్చారని అన్నారు. పోలింగ్ రోజు కేవలం కొన్ని ఈవీఎంలు మాత్రమే పనిచేయడం లేదని సీఈఓ పదేపదే చెప్పినా ఈసీలో ఉన్న సోషల్ మీడియా వర్కర్స్ మాత్రం తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని చంద్రబాబు చేసిన ట్వీట్ ను వీరు ప్రమోట్ చేశారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News