బ్రేకింగ్: పర్చూరు వైసీపీ అభ్యర్థి విషయంలో ట్విస్ట్

ప్రకాశం జిల్లా పర్చూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం మార్చుకుంది. వైసీపీ తరపున ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురామ్ పోటీ [more]

Update: 2019-03-13 06:08 GMT

ప్రకాశం జిల్లా పర్చూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం మార్చుకుంది. వైసీపీ తరపున ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురామ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవలే వైసీపీలో చేరిన ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఆయనకు అమెరికా పౌరసత్వం ఉన్నందున న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని పార్టీ భావించింది. ఆయన అమెరికా పౌరసత్వం రద్దుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినా అది పూర్తి కాలేదు. దీంతో పర్చూరు అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పోటీ చేయాలని జగన్ సూచించారు.

Tags:    

Similar News