దొంగలంతా చంద్రబాబు పక్కనే..!

దొంగలందరినీ పక్కన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో [more]

Update: 2019-04-16 09:00 GMT

దొంగలందరినీ పక్కన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… దొంగనోట్లు ముద్రించిన రామకృష్ణగౌడ్, తెల్గి స్టాంపుల కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారు, యూరో లాటరీ కుంభకోణం చేసిన కోలా కృష్ణమోహన్, ఎర్రచందనం దొంగలు, టాప్ 100 మంది బ్యాంకులకు రుణాల ఎగవేతదారుల్లో 20 మంది, ఈవీఎం దొంగలించిన క్రిమినల్, ప్రజల డేటా చోరీ చేసిన అశోక్, కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ ఐడీలు దొంగతనం చేసిన దొంగలను చంద్రబాబు వెంట పెట్టుకున్నారని, వెనకేసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్నాడని తెలిసి చంద్రబాబు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఎంతగా దిగజారుతారో అర్థమవుతుందన్నారు. ఈవీఎంలపై నమ్మకం లేని చంద్రబాబు 2014 తర్వాత గెలిచిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని అడిగారు. నంద్యాల ఉపఎన్నికలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచారా అని ప్రశ్నించారు. ఓడిపోతూ దొంగ రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చేతనవుతుందన్నారు. చంద్రబాబుకు భారతీయ ఇంజనీర్లపై గౌరవం లేదని, గతంలో కూడా భారతీయులు మురికివాడలు కడతారని అవమానించారని ఆరోపించారు.

Tags:    

Similar News