ఎల్లుండి వైసీపీ శాసనసభ పక్ష సమావేశం?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈ [more]

Update: 2020-03-21 06:08 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ నాలుగుస్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేయాలో స్పష్టంగా ఆరోజు చెప్పనున్నారు. ప్రాధాన్యత క్రమాలను కూడా వివరించనున్నారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చర్చిస్తారు.

Tags:    

Similar News