కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ నేతలు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వైసీపీ [more]

Update: 2019-04-15 11:50 GMT

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు, బుట్టా రేణుక, బాలశౌరి, సి.రామచంద్రయ్యతో కూడిన బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తూ ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వారు కోరారు.

Tags:    

Similar News