బాబూ… ఈ జిమ్ముక్కులు ఆపు..!

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ నేతలు, టీడీపీ అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలను [more]

Update: 2019-03-26 10:50 GMT

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ నేతలు, టీడీపీ అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలను అమాయకులు అనుకొని చంద్రబాబు తన మీడియాను అడ్డుపెట్టుకొని జిమ్మిక్కులు చేస్తుందన్నారు. తమ పార్టీ, జగన్ ముందు నుంచీ ఒకే విధానంతో ఉన్నామని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తామంటే వద్దని చెప్పాలా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయినా మట్టికొట్టుకు పోవాల్సిందేనన్నారు. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ త్వరలోనే ఏపీలోనూ కనుమరుగు కావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News