టీటీడీ బంగారం తరలింపుపై వైసీపీ అనుమానాలు

తమిళనాడులో నిన్న పోలీసులకు దొరికిన సుమారు 1,400 కిలోల బంగారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. ఇవాళ ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి [more]

Update: 2019-04-18 09:56 GMT

తమిళనాడులో నిన్న పోలీసులకు దొరికిన సుమారు 1,400 కిలోల బంగారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. ఇవాళ ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ… 1400 కిలోల బంగారం తరలిస్తుంటే కనీసం పత్రాలు కూడా ఎందుకు లేవని ప్రశ్నించారు. అంత బంగారాన్ని సరైన సెక్యూరిటీ కూడా లేకుండా ఎందుకు తరలించాల్సి వచ్చిందని అన్నారు. ఈ బంగారం గురించి టీటీడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలపై సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ బంగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. టీటీడీ బంగారం గురించి తెలుసుకోవడం ప్రజల హక్కు అని, ఈ విషయంపై పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News