ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ సంచలన ఆరోపణలు

ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినందున ఆయనపై బదిలీ వేటు వేశారని [more]

Update: 2019-03-27 09:42 GMT

ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినందున ఆయనపై బదిలీ వేటు వేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడానికి వెంకటేశ్వరరావు పెద్ద వ్యవస్థను తయారుచేశారని ఆరోపించారు. విదేశాల నుంచి ఇందుకు కావాల్సిన టెక్నాలజీని అక్రమంగా తెప్పించి, 20 మంది హ్యాకర్లను పెట్టుకొని ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేసిన ఆధారాలు ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక కీలకంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కోసమే ఆయన పనిచేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా చెప్పారని గుర్తు చేశారు.

Tags:    

Similar News