వివేకా హత్య కేసులో క్లూ ఇస్తే ఐదు లక్షలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్య కేసులో సమాచారం అందిస్తే ఐదు లక్షల బహుమానాన్ని సీబీఐ ప్రకటించింది. వైఎస్ వివేకానందరెడ్డి [more]

Update: 2021-08-21 02:31 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్య కేసులో సమాచారం అందిస్తే ఐదు లక్షల బహుమానాన్ని సీబీఐ ప్రకటించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లవుతుంది. అయితే ఇంతవరకూ నిందితులు ఎవరో తేలలేదు. హత్యకు గల కారణాలు కూడా స్పష్టం కాలేదు. ఇటీవల కీలక నిందితుడిగా అనుమానించి సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా సీీబీఐ అధికారులు పత్రికా ప్రకటన చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేేసులో నమ్మకమైన, ఖచ్చితమైన సమాచారం ఇస్తే ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించడం విశేషం.

Tags:    

Similar News