ఆ 8 కోట్లు సునీల్ యాదవ్ కు ఇచ్చిందెవరు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చేలా కన్పిస్తుంది. ముగ్గురు అనుమానితుల జాబితాను సీబీఐ అధికారులు సిద్దం చేశారు. అయితే వైఎస్ వివేకాను హత్య చేసేందుకు [more]

Update: 2021-07-24 06:28 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చేలా కన్పిస్తుంది. ముగ్గురు అనుమానితుల జాబితాను సీబీఐ అధికారులు సిద్దం చేశారు. అయితే వైఎస్ వివేకాను హత్య చేసేందుకు నిందితులకు 8 కోట్ల సుపారీ ఇచ్చారు. ఈ 8 కోట్లను సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కడప జి్లా మోతునూతలపల్లికి చెందిన సునీల్ కుమార్ యాదవ్ కు అంత ఆర్థిక స్థోమత లేదు. ఆయనకు ఎవరో ఇచ్చి ఉంటారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఎనిమిది కోట్లు సునీల్ కుమార్ యాదవ్ కు ఎవరు ఇచ్చారన్నది తేలితే వైఎస్ వివేకా హత్య చేసిందెవరు? చేయించెదవరు? కారణాలేంటివన్నవి తెలుస్తాయి. ఆయన తనను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టును ఆశ్రయించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది.

Tags:    

Similar News