వివేకా హత్య కేసులో నేడు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సాగుతున్న విచారణలో అనేక మంది అనుమానితులను ప్రశ్నించారు. వివేకా [more]

Update: 2021-06-30 03:39 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సాగుతున్న విచారణలో అనేక మంది అనుమానితులను ప్రశ్నించారు. వివేకా ఫోన్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు ముమ్మరం చేశారు. వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. మరికొందరు అనుమానితులను కూడా నేడు సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పులివెందుల ప్రాంతానికి చెందిన వారిని ఈరోజు ప్రశ్నించనున్నారు. ఇరవై రోజుల నుంచి సీబీఐ అధికారుల విచారణ వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతంది.

Tags:    

Similar News