వైఎస్ షర్మిల సభ అనుమతి రద్దు

వైఎస్ షర్మిల సభ అనుమతిని రద్దు చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు [more]

Update: 2021-04-06 01:56 GMT

వైఎస్ షర్మిల సభ అనుమతిని రద్దు చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలోనే తన రాజకీయ పార్టీ గురించి వైఎస్ షర్మిల ప్రకటించనున్నాు. అయితే తొలుత సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు, కరోనా తీవ్రతరం కావడంతో సభకు అనుమతులు రద్దు చేశారు. జీవో 68, 69 ప్రకారం షర్మిల పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిసతూ తాము సభ నిర్వహించుకుంటామని సభ నిర్వాహకులు పోలీసులకు సమాధానమిచ్చారు. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News