కేంద్ర ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను కేంద్ర ప్రభుత్వం హేట్ బ్యాంకుగా వాడుకుంటుందని వైఎస్ షర్మిల అన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం [more]

Update: 2021-03-23 01:05 GMT

వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను కేంద్ర ప్రభుత్వం హేట్ బ్యాంకుగా వాడుకుంటుందని వైఎస్ షర్మిల అన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకు గా వాడుకుంటుందని షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల మైనారిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింలు లేని తెలంగాణను ఊహించలేమన్నారు. వక్ఫ్ బోర్డు కు చెందిన యాభై వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దేనన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు.

Tags:    

Similar News