షర్మిల టూర్ వాయిదా.. కారణం అదే

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించాలనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. [more]

Update: 2021-02-14 02:31 GMT

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించాలనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో వైఎస్ షర్మిల తన ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎన్నికల కోడ్ తొలగిన తర్వాత షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని చెబుతున్నారు. షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించాలనుకున్నారు.

Tags:    

Similar News