రోషం…పౌరుషంపై షర్మిల రెస్సాన్స్ ఇదే…!!!

పౌరుషం, రోషం అంటూ చంద్రబాబు ఆయనకు సూట్ అవ్వని మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె గుడివాడలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… తమకు [more]

Update: 2019-04-02 12:00 GMT

పౌరుషం, రోషం అంటూ చంద్రబాబు ఆయనకు సూట్ అవ్వని మాటలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మంగళవారం ఆమె గుడివాడలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… తమకు కేసీఆర్, మోడీతో పొత్తు ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పౌరుషం లేదా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇదే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం కూడా లేకుండా చర్చలు జరిపినప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా ? చచ్చిపోయిందా ? అని ప్రశ్నించారు. పిల్లి గట్టిగా పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోదని పేర్కొన్నారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, పొత్తుల అవసరం కూడా లేదన్నారు. సింహం సింగల్ గా వస్తుందని, నక్కలే గుంపుగా వస్తాయన్నారు. జగన్ సింగిల్ గానే వస్తుందని, చంద్రబాబే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని అన్నారు.

చంద్రబాబు యూటర్న్ తీసుకునే వారా..?

ప్రత్యేక హోదా కోసం జగన్ ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి పోరాటం చేశారని, జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే చంద్రబాబు యూరట్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని చెప్పేవారా అని ప్రశ్నించారు. 40 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ఎంత అప్పు ఉందో ఈ ఐదేళ్లలో చంద్రబాబు అంత అప్పు చేశారని పేర్కొన్నారు. మళ్లీ చంద్రబాబును నమ్మి మన భవిష్యత్తును వారి చేతిలో పెడితే నాశనం చేస్తారన్నారు. గత ఎన్నికల్లో 600 హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ చేపలకు ఎర వేసినట్లు, చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లు పసుపు-కుంకుమ, పింఛన్లు అంటూ చంద్రబాబు ఎర వేస్తున్నారని అన్నారు. నిన్ను నమ్మం బాబు అని ప్రజలంతా చెప్పాలని కోరారు. తొమ్మిదేళ్లుగా నిరంతరం ప్రజల్లో ఉండి జగన్ అందరి సమస్యలూ అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని ఆశపడుతున్న జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ అధికారంలోకి రావాలన్నారు.

Tags:    

Similar News