మాట నిలబెట్టుకుంటా
మద్యనిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మద్యం వినియోగం ఏపీలో [more]
మద్యనిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మద్యం వినియోగం ఏపీలో [more]
మద్యనిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మద్యం వినియోగం ఏపీలో తగ్గిందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. బెల్ట్ షాపులను కట్టడి చేయడం వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. అక్టోబరు నెల నుంచి మద్యం షాపులను, బార్ల సంఖ్యలను కూడా తగ్గించబోతున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని తెలిపారు.