జగన్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ బృందం ఆయనను కలసి శుభాకాంక్షలు అందచేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం జగన్ నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, [more]

Update: 2019-05-29 14:43 GMT

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ బృందం ఆయనను కలసి శుభాకాంక్షలు అందచేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం జగన్ నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కలవనున్నారు. వారు జగన్ కు చంద్రబాబు సంతకం చేసిన అభినందన పత్రాన్ని అందజేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రతినిధి బృందాన్ని పంపుతున్నారు.

Tags:    

Similar News