నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లను కలసే అవకాశముంది. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు [more]

Update: 2020-09-22 02:23 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లను కలసే అవకాశముంది. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ లను కోరింది. వారి అపాయింట్ మెంట్ లు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, కొద్దిసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. రాత్రికి ఢిల్లీలో బస చేసి బుధవారం నేరుగా ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. బుధవారం రాత్రికి జగన్ తిరుమలలోనే ఉంటారు. గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తో కలసి తిరుమలలో నిర్మించనున్న కర్ణాటక అతిథి గృహానికి సంబంధించి భూమి పూజలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News