భయపడి ఎందుకు తక్కువ చూపిస్తాం..కొట్టిపారేసిన జగన్

కేసులు ఎక్కువ వస్తాయని భయపడి పరీక్షలు తగ్గించే ప్రయత్నం చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కరోనా కస్టర్లలో 95 శాతం పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఎంతమందికైనా [more]

Update: 2020-07-28 08:42 GMT

కేసులు ఎక్కువ వస్తాయని భయపడి పరీక్షలు తగ్గించే ప్రయత్నం చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కరోనా కస్టర్లలో 95 శాతం పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఎంతమందికైనా చికిత్స అందించగలమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసులు తక్కువ చేసి చూపిస్తున్నామనడం సరికాదన్నారు. పరీక్షలు ఏ రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడిపై వైఎస్ జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.

Tags:    

Similar News