నేడు జగన్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 108, 104 అంబులెన్స్ లను నేడు జగన ప్రారంభించనున్నారు. పేదలకు మెరుగైన వైద్య [more]

Update: 2020-07-01 02:16 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 108, 104 అంబులెన్స్ లను నేడు జగన ప్రారంభించనున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మొబైల్ వైద్యాన్ని జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. మొత్తం 1,088 వాహనాలను నేడు బెంజ్ సర్కిల్ లో జగన్ ప్రారంభిస్తారు. మండలానికి ఒక వాహనాన్ని కేటాయించనున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన వాహనాలు నేటి నుంచే ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన 108 సేవలను మరింత విస్తృతంగా చేసేందుకు జగన్ మండలానికి ఒక వాహనాన్ని కేటాయించారు.

Tags:    

Similar News