జగన్ మరో వరం… వారి కోసం 548 కోట్లు

జగన్ మరోసారి సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. [more]

Update: 2020-06-29 06:21 GMT

జగన్ మరోసారి సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. రెండో విడతగా ఎంఎస్ఎంఈలకు 548 కోట్ల రూపాయలను జగన్ విడుదల చేశారు. పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు ప్రోత్సహాకాలను అందిస్తుందని జగన్ చెప్పారు. పరిశ్రమలు బతికితేనే ఉపాధి అవకాశాలు ఉంటాయని జగన్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం బాకాయి పెట్టిన 800 కోట్ల పారిశ్రామిక రాయితీలను కూడా విడుదల చేశామని జగన్ గుర్తు చేశారు. చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జగన్ అన్నారు. ఏప్రిల్, మే, జూన్ లో ఫిక్స్ డ్ విద్యుత్తు ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

Tags:    

Similar News