బ్రేకింగ్ : నిజాయితీగా ఏం చేయగలనో అదే చెబుతా

గత ప్రభుత్వం చెప్పినట్లుగా తాను మాటలు చెప్పనని వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని [more]

Update: 2020-05-28 07:07 GMT

గత ప్రభుత్వం చెప్పినట్లుగా తాను మాటలు చెప్పనని వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పిందన్నారు. కానీ చూస్తే అది గ్రాఫిక్స్ అని తేలిపోయిందన్నారు. ఉత్తమాటలు చెప్పేవాడిని కానన్నారు. పరిశ్రమలకు వేల కోట్లు బకాయీలు పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ అని గత ప్రభుత్వం చెప్పుకుందని జగన్ ఎద్దేవా చేశారు. ఎయిర్ బస్, మైక్రోస్టాఫ్, హైపర్ లూప్ అని తాను చెప్పేవాడిని కానన్నారు. గ్రాఫిక్స్ చూపించి మోసం చేయనని చెప్పారు. ఇదంతా మీడియాను మేనేజ్ చేయడమేనని జగన్ చెప్పారు. నిజాయితీగా ఏం చేయగలనో అదే తాను చెబుతానని జగన్ అన్నారు. ఏదైనా మాట్లాడితే మాటల్లో నిజాయితీ ఉండాలన్నారు. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని చెప్పారు.

Tags:    

Similar News