వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి… టెస్ట్ లు మరింత ఎక్కువగా?

కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులను అప్రమత్తం [more]

Update: 2020-04-16 06:53 GMT

కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏపీలో 534 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే టెస్టింగ్ ల సంఖ్య కూడా మరింతగా పెంచాలని జగన్ అధికారులకు సూచించారు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలన్నారు. దీంతో పాటు రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ జరుగుతున్న తీరుపై కూడా జగన్ సమీక్షించారు.

Tags:    

Similar News