జగన్ నిర్ణయించారు… అప్పుడేనట

ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను త్వరగా ముగించేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. ఈ నెల [more]

Update: 2020-03-21 06:01 GMT

ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను త్వరగా ముగించేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, 28 లేదా 29వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల ఖర్చుల అనుమతి పొందేందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31 వ తేదీలోపే బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. లేకుంటే సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

Tags:    

Similar News