కడుపు మంటకు చికిత్స లేదు

మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొందరు అడ్డం పడుతుంటారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కర్నూలులో వైెఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. [more]

Update: 2020-02-18 07:54 GMT

మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొందరు అడ్డం పడుతుంటారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కర్నూలులో వైెఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు చూసి చంద్రబాబుతో సహా విపక్షాల కడుపు మంటతో ఉన్నారన్నారు. కడుపు మంటకు ఆరోగ్యశ్రీలో చికిత్స లేదన్నారు. అలాగే కంటి వెలుగులో చెడుచూపుకు, కుళ్లిన మెదడుకు చికిత్సలు, మందులు లేవన్నారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అయినా తాను వీటికి భయపడబోనని తెలిపారు. ఏపీ ప్రజల ఆరోగ్యాన్ని కాపడటమే తమ ముందున్న లక్ష్యమని జగన్ వివరించారు. అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

Tags:    

Similar News