నేడు మళ్లీ ఢిల్లీకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశాలతో [more]

Update: 2020-02-14 02:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశాలతో పాటు శాసనమండలి రద్దు, మూడు రాజధానుల అంశాలపై అమిత్ షాతో జగన్ ప్రత్యేకంగా చర్చించనున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపైన కూడా జగన్ చర్చించనున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు జగన్ అమిత్ షాతో భేటీ కానున్నారు.

Tags:    

Similar News