బ్రేకింగ్ : రద్దు కన్ఫర్మ్ అయినట్లేనా?

శాసనమండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయనిపుణులు, సీనియర్ పార్టీ నేతలతో సమావేశమయిన జగన్ మండలి రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు [more]

Update: 2020-01-23 07:34 GMT

శాసనమండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయనిపుణులు, సీనియర్ పార్టీ నేతలతో సమావేశమయిన జగన్ మండలి రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మండలిలో ప్రభుత్వానికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మంత్రుల సమావేశంలోనూ మండలి రద్దుకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్ల తెలిసింది. ఏపీ మంత్రి వర్గం అత్యవసరంగా సమావేశం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలను కూడా మరోరోజు పొడిగించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మండలి రద్దుపై ఇప్పటికే అధికారులతో కూడా జగన్ మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభలో మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ బిల్లులను కూడా శాసనమండలిలో అడ్డుకున్నారన్నారు. అందుకే మరోసారి శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టామన్నారు జగన్. జాప్యం తప్ప వారు చేయగలిగిందేమీ లేదన్నారు.

Tags:    

Similar News