జగన్ నోటి నుంచి 21 మంది

ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు యాభై నిమిషాల నుంచి మాట్లాడుతున్నారని, 21 మంది సభ్యులున్న టీడీపీ నుంచి ఐదుగురు మాట్లాడారన్నారు. 151 [more]

Update: 2020-01-20 15:08 GMT

ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు యాభై నిమిషాల నుంచి మాట్లాడుతున్నారని, 21 మంది సభ్యులున్న టీడీపీ నుంచి ఐదుగురు మాట్లాడారన్నారు. 151 మంది సభ్యులున్న వైసీపీ నుంచి ఏడుగురు మాట్లాడరన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. చంద్రబాబు ఇంకా ఎంతసేపు మాట్లాడతారో చెప్పాలన్నారు. యాభై నిమిషాల సమయం ఆయనకు సరిపోలేదా? అని ప్రశ్నించారు. అయితే టీడీపీకి 23 మంది సభ్యులున్నారు. అందులో వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు పార్టీకి దూరంగా ఉన్నారు. అంతే తప్ప వారు పార్టీకి రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ టీడీపీకి 21 మంది సభ్యులే ఉన్నారనడం చర్చనీయాంశంగా మారి.

Tags:    

Similar News