బ్రేకింగ్ : తప్పుడు రాతలపై జగన్ వార్నింగ్

ఒక వర్గం మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను రాస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ [more]

Update: 2021-06-28 12:57 GMT

ఒక వర్గం మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను రాస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. కోవిడ్ ను ఎదుర్కొనడంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ఓర్చుకోలేకనే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారని జగన్ అన్నారు. కనీస విలువలు పాటించకుండా ఈ వార్తలు రాస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ కొరత ఉందని ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. 70 శాతం ఆక్సిజన్ బెడ్స్, 70 శాతం వెంటిలేటర్స్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇంత నిస్సిగ్గుగా రాతలు ఎలా రాస్తున్నారని జగన్ ప్రశ్నించరు.

Tags:    

Similar News