జగన్ ఢిల్లీలో బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు జరుపుతున్నారు. తొలుత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను జగన్ కలిశారు. అనంతరం కేంద్ర [more]

Update: 2021-06-10 13:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరస భేటీలు జరుపుతున్నారు. తొలుత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను జగన్ కలిశారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు కు విడుదల కావాల్సిన నిధుల గురించి జగన్ మంత్రితో చర్చించారు. అంచనా వ్యయం 55,656 కోట్లకు ఆమోదం తెలపాల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. పునరావాస పనులను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని జగన్ మంత్రి షెకావత్ కు వివరించారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని జగన్ కోరారు. ఈరోజు రాత్రి 9గంటలకు జగన్ అమిత్ షాను కలవనున్నారు.

Tags:    

Similar News