మూడు గంటలు జగన్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు గంటలుగా కోర్టులోనే ఉన్నారు. ఈరోజు ఉదయం 11గంటల ప్రాంతంలో జగన్ [more]

Update: 2020-01-10 08:38 GMT

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు గంటలుగా కోర్టులోనే ఉన్నారు. ఈరోజు ఉదయం 11గంటల ప్రాంతంలో జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు. దాదాపు 11 ఛార్జిషీట్లు ఉండటం, 16 వారాలుగా జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అన్నింటిపై విచారణ చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. తన తరపు తరుపున సహనిందితుడు హాజరవుతారని చెప్పారు. దీంతో కేసు ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది.

Tags:    

Similar News