బ్రేకింగ్ : జగన్ వారికి పది లక్షల ఆర్థిక సాయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుయా ఆసుపత్రిలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రే‍షియోను జగన్ ప్రకటించారు. నిన్న రుయా [more]

Update: 2021-05-11 08:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుయా ఆసుపత్రిలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రే‍షియోను జగన్ ప్రకటించారు. నిన్న రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఈ దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జగన్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ ప్రకటించారు.

Tags:    

Similar News