నేడు చిత్తూరుకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మవొడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమ్మఒడి పథకం కింద పాఠశాలలకు పంపిన [more]

Update: 2020-01-09 02:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మవొడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అమ్మఒడి పథకం కింద పాఠశాలలకు పంపిన విద్యార్థుల తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం దాదాపు 6,500 కోట్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. ఇప్పటికే లబ్దిదారుల జాబితా తయారు కావడంతో జగన్ ఈ పథకం ప్రారంభించిన వెంటనే వారి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు పడనున్నాయి. జగన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జగన్ రాక సందర్భంగా మానవహారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News