విశాఖలో జగన్ మాట్లాడలేదెందుకు?

విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్యాయత, అనురాగాల మధ్య విశాఖ ఉత్సవ్ ను ప్రారంభిస్తున్నట్లు మాత్రమే జగన్ మాట్లాడారు. తర్వాత విశాఖ ఉత్సవ్ [more]

Update: 2019-12-28 13:41 GMT

విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్యాయత, అనురాగాల మధ్య విశాఖ ఉత్సవ్ ను ప్రారంభిస్తున్నట్లు మాత్రమే జగన్ మాట్లాడారు. తర్వాత విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించారు. తర్వాత మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ ను జ్ఞాపికతో సత్కరించారు. ఆ తర్వాత జగన్ వేదిక మీదనుంచి వెళ్లిపోయారు. అయితే విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మొన్నటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉంటే మాట్లాడేవారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో జగన్ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతందని భావించి ఆయన బహిరంగ సభలో మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ప్రయాణించే విమాన సమయం దగ్గరపడుతుండటతో ప్రసంగిచంలేదని చెబుతన్నారు. మొత్తం మీద అంతపెద్ద బహిరంగ సభలో… జనాలు కిక్కిరిసిపోయి ఉన్న ఆర్కే బీచ్ లో… అదీ విశాఖలో జగన్ మాట్లాడకుండా వెళ్లిపోవడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశంపై జగన్ మాట్లాడతారని అందరూ భావించారు.

Tags:    

Similar News