బ్రేకింగ్ : బీజేపీ అగ్రనేతతో జగన్ భేటీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేతతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. నిన్న మంత్రి వర్గ సమావేశం పూర్తయిన వెంటనే మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో [more]

Update: 2019-12-28 03:01 GMT

భారతీయ జనతా పార్టీ అగ్రనేతతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. నిన్న మంత్రి వర్గ సమావేశం పూర్తయిన వెంటనే మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో జగన్ సమావేశం అయ్యారు. ఇద్దరూ లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో సురేష్ ప్రభు కీలకంగా వ్యవహరించారు. మారిన జాతీయ రాజకీయాల దృష్ట్యా సురేష్ ప్రభును బీజేపీ కేంద్ర పెద్దలే జగన్ వద్దకు పంపారన్న ప్రచారం జరుగుతంది. అయితే అభివృద్ధి అంశాలపైనే తాను జగన్ తో చర్చించామని సురేష్ ప్రభు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సురేష్ ప్రభు ఏపీ ద్వారా రాజ్యసభకు వెళ్లేందుకు వచ్చారా? అన్న చర్చ కూడా జరుగుతుంది.

Tags:    

Similar News