బ్రేకింగ్ : ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ

ప్రధాని మోదీ అపాయింట్ ెమంట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. స్వయంగా కలసి సమస్యను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. [more]

Update: 2021-03-09 07:47 GMT

ప్రధాని మోదీ అపాయింట్ ెమంట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. స్వయంగా కలసి సమస్యను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోవాలని జగన్ తన లేఖలో కోరారు. నాలుగు ప్రతిపాదనలను జగన్ మోదీ ముందు ఉంచారు. 1. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించడం. 2. స్వల్ప దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీగా మార్చాలి. 3. స్టీల్ ప్లాంట్ ఏరియాలో నిరుపయోగంగా ఉన్న ఏడువేల ఎకరాలను విక్రయించి సంస్థను కాపాడటం. 4. పెట్టుబడులు ఉపసంహరించకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. తాను అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘ నేతలతో కలసి కలుస్తానని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News