ఆ మూడుసిటీలను అభివృద్ధి చేయండి

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుపతి,విశాఖపట్నం, బెంగుళూరు [more]

Update: 2021-02-06 00:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుపతి,విశాఖపట్నం, బెంగుళూరు సమీపంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కొక్క ఐటీ సిటీ కనీసం రెండు వేల ఎకరాల్లో ఉండేలా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి సిటీలో అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, ప్రతి సిటీకి ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News