బ్రేకింగ్ : ఇంకొకటి రద్దు చేసిన జగన్

గత తెలుగుదేశం ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గతంలో చంద్రబాబునాయుడు రైతు [more]

Update: 2019-09-25 07:03 GMT

గత తెలుగుదేశం ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గతంలో చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం ఐదు విడతల కింద రుణమాఫీ చేయాలని భావించారు. తొలి మూడు విడతల రుణమాఫీని చంద్రబాబు ప్రభుత్వం చేసింది. నాలుగు,ఐదు విడతల రుణమాఫీని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ జీవో అమలుకు నోచుకోలేదు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవోను రద్దు చేశారు. దీంతో దాదాపు 7.959 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని జగన్ ప్రభుత్వం రద్దు చేసినట్లయింది.

Tags:    

Similar News