జగన్ మరో కాపు నేస్తం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ [more]

Update: 2019-11-27 09:01 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాపు నేస్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని రెండుగా విభజించాలని నిర్ణయించింది. నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ళను ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 3,982 ఎకరాల భూమిని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం సేకరిరించాలని నిర్ణయించింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం 3,450 కోట్లు కేటాయింపులకు ఆమోదంతెలిపింది. విద్యా దీవెనతో ఫీజు రీఎంబర్స్ పథకాన్ని ప్రారంభించనుంది.

Tags:    

Similar News