కిక్కు కావాలంటే రీఛార్జి చేసుకోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో మద్యనియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఏపీలో లిక్కర్ పర్ఛేజ్ కార్డులను ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ [more]

Update: 2019-12-05 08:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో మద్యనియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఏపీలో లిక్కర్ పర్ఛేజ్ కార్డులను ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ యోచిస్తుంది. దీనికి విధివిధానాలను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఎవరైనా మద్యం షాపుల నుంచి మద్యాన్ని కొనుగోలు చేయాలన్నా, బార్ కు వెళ్లి మద్యం సేవించాలన్నా లిక్కర్ పర్ఛేజ్ కార్డు ఉండి తీరాలి. ఒక్కొక్క కార్డు ఐదువేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ము అయిపోయిన వెంటనే తిరిగి రీ ఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 25 సంవత్సరాలు దాటిన వారికి, ఎలాంటి రోగం లేదని వైద్యుడి నుంచి సర్టిఫికేట్ ఉంటేనే ఈ కార్డులు ఇస్తారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

Tags:    

Similar News