జగన్ మరో కీ డెసిషన్

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న బార్ల శాతాన్ని నలభై శాతానికి తగ్గించాలని జగన్ నిర్ణయించారు. బార్ల తగ్గింపు [more]

Update: 2019-11-19 11:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న బార్ల శాతాన్ని నలభై శాతానికి తగ్గించాలని జగన్ నిర్ణయించారు. బార్ల తగ్గింపు విషయంపై జగన్ కొద్దిసేపటి క్రితం అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బార్ల శాతాన్ని 50 శాతానికి తగ్గించాలని జగన్ తన అభిప్రాయం వ్యక్తం చేయగా, అధికారులు మాత్రం ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించామని, బార్ల శాతం ఒక్కసారిగా యాభై శాతం తగ్గించడం సరికాదని సూచించారు. దీనికి ఏకీభవించిన జగన్ ఏపీలో బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఏపీలో బార్లలోనూ మద్యం ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న బార్ల స్థానంలో కొత్త వారికి లైసెన్సులు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News