రేపు గుంటూరుకు జగన్

అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం ఆదుకునే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపు 1130 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అగ్రిగోల్డ్ లో [more]

Update: 2019-11-06 11:52 GMT

అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం ఆదుకునే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపు 1130 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అగ్రిగోల్డ్ లో పదివేల రూపాయలు లోపు డిపాజిట్లు చేసిన వారందరికీ ప్రభుత్వం చెల్లిస్తుంది. రేపు గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. జగన్ ఇక్కడ చెక్కులు ఇవ్వగానే వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని తాను సీఎం పదవి చేపట్టిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News