ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టునుు పూర్తి చేసేందుకు పదిహేను వేల కోట్లు అవసరమని లేఖలో పేర్కొన్నారు. 2021 నాటికి [more]

Update: 2020-08-27 02:29 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టునుు పూర్తి చేసేందుకు పదిహేను వేల కోట్లు అవసరమని లేఖలో పేర్కొన్నారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, వచ్చే మార్చి నెలలోపు నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన 3,805 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు నాబార్డును కోరాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. నిధుల విడుదలకు కష్టంగా ఉన్న విధివిధానాలను సులభతరం చేయాలని జగన్ తన లేఖలో కోరారు.

Tags:    

Similar News