బాబుపై చిందులు… కేసీఆర్ పై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నీటి [more]

Update: 2019-07-11 04:44 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఫైర్ అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నీటి పారుదల ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడమేంటని టీడీపీ ప్రశ్నించింది. దీనికి జగన్ సమాధానం చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబునాయుడు గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలు కలసి కృష్ణా నదికి తరలించి రెండు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ఆల్మట్టి పెంచుతుంటే చంద్రబాబునాయుడు ఏం చేశారన్నారు. కేసీఆర్ ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే గోదావరి నీటి తరలింపు కార్యక్రమానికి అంగీకారం తెలిపారన్నారు.

Tags:    

Similar News